సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • టాలీవుడ్ ని వదిలే ప్రసక్తే లేదంటున్న రకుల్ 
  • రేపు ప్రేక్షకుల ముందుకు సిద్ధార్థ్ 'గృహం'
  • యూరప్ షెడ్యూల్ పూర్తి చేసిన 'అజ్ఞాతవాసి' 
  • 'మెహబూబా' తాజా షెడ్యూల్ పూర్తి  
*  ఇతర భాషా చిత్రాలలో అవకాశాలు వచ్చినప్పటికీ, టాలీవుడ్ ని వదిలి మాత్రం వెళ్లనని అంటోంది అందాలతార రకుల్ ప్రీత్ సింగ్. "ఇక్కడి ప్రేక్షకులు ఆదరించినంత కాలం తెలుగు సినిమాలు చేస్తూనే వుంటాను. ఇక చాలు వెళ్లమంటే అప్పుడు వెళ్లిపోతాను. అంతవరకు ఇక్కడే!' అంటూ చెప్పుకొచ్చింది.  
*  సిద్ధార్థ్ నటించిన 'గృహం' చిత్రం సెన్సార్ పూర్తయింది. ఈ చిత్రాన్ని రేపు (నవంబర్ 17) తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు. సిద్ధార్థ్ సరసన ఆండ్రియా కథానాయికగా నటించిన ఈ హారర్ చిత్రానికి మిలింద్ రావ్ దర్శకత్వం వహించాడు.
*  పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న 'అజ్ఞాతవాసి' చిత్రం బల్గేరియా షెడ్యూల్ నిన్నటితో ముగిసింది. దీంతో పవన్ కల్యాణ్ లండన్ పయనమవగా, యూనిట్ హైదరాబాదుకి బయలుదేరింది.
*  పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'మెహబూబా' చిత్రం పంజాబ్ షెడ్యూలు పూర్తయింది. నెలరోజుల పాటు హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్ లలో ఈ చిత్రం షూటింగ్ నిర్వహించారు. ఆకాష్ పూరీ, నేహా శెట్టి ఇందులో జంటగా నటిస్తున్నారు.        
Go Back to Shorts
Rakul
siddharth
pavan
Puri Jagannadh

More Telugu News